న్యూస్
ఫీచర్స్
సినిమా
బిజినెస్
స్పోర్ట్స్
ఎడిటోరియల్
ఎన్నారై
లెటర్ టు ఎడిటర్
యూలిప్‌ ఆర్డినెన్స్‌ స్థానంలో చట్టం

న్యూఢిల్లీ, జులై 21 (ఫీచర్స్ ఇండియా): యూలిప్‌ ఆర్డినెన్స్‌పై ఆర్‌బీఐకి కొన్ని అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఈ ఆర్డినెన్స్‌ స్థానంలోనే త్వరలో చట్టం తీసుకురానున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రానున్న పార్ల మెంట్‌ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్ట నున్నారు. యూలిప్‌లపై పరిధి ఎవరిదనే విషయంలో సెబీ, ఐఆర్‌డీఐల మధ్య వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఐఆర్‌డీఏకే పరిధిని కట్టబెడుతూ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్‌ జారీ చేసింది. డైరెక్ట్‌ టాక్స్‌ కోడ్‌పై కూడా ఈ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టనున్నారు.