|
|
బాబ్లీని ఆపితే.. తప్పుకుంటాం: టీడీపీ
హైదరాబాద్, జులై 20 (ఫీచర్స్ ఇండియా): కేంద్రంతో పాటు ఆంధ్రా, మహారాష్ట్రల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ప్రధానితో మాట్లాడి బాబ్లీతో సహా మిగతా ప్రాజెక్టులను నిలువరించే చర్యలు తీసుకుని, అందుకు తగిన యంత్రాంగాన్ని నెలకొల్పుతామని హామీ ఇస్తే ఉప ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని టీడీపీ ప్రకటించింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్ ఐటీఐ కాలేజీలో జ్యుడీషియల్ రిమాండ్లో ఉన్న నేతలు సోమవారం చంద్రబాబు నేతృత్వంలో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ మీడియా కమిటీ చైర్మన్ ఎల్వీఎస్సార్కే ప్రసాద్ ఒక ప్రకటనలో తె లిపారు.
|
|
|