|
|
ఆగస్టు 3 నుండి 8 వరకు రిక్యూట్మెంట్ ర్యాలీ
వరంగల్, జులై 19 (ఫీచర్స్ ఇండియా): సెంట్రల్ ఎయిర్ మెన్ సెలక్షన్ బోర్డు ఆగస్టు 3 నుండి 8 వరకు ఖమ్మంలో రిక్యూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా కె. కె. శర్మ వింగ్ కమెండర్ ఎయిర్ మెన్ సెలక్షన్ సెంటర్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇండియన్ ఎయిర్ ఫోర్సులో ఎయిర్ మెన్ల భర్తీ కై ర్యాలీని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. సర్థార్ పటేల్ స్టేడియం ఖమ్మంలో ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇతర వివరాలను పైన తెలిపిన అడ్రస్లో సంప్రదించవచ్చునని అన్నారు.
|
|
|